నిన్న 3వ విడత లోక్ సభ ఎన్నికలు జరిగిన 116 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ 66 శాతం నమోదైంది.


నిన్న జరిగిన 3వ విడత లోక్ సభ ఎన్నికలలో 66 శాతం పోలింగ్ నమోదైంది. కొత్త ధిల్లీలో నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం సీనియర్ ఉప కమిషనర్ ఉమేష్ సిన్హా, చిన్న చిన్న సంఘటనలు మినహా 116 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. 543 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 303 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిందని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించున్నారు. త్రిపురలో 79.64 శాతం, పశ్చిమబెంగాల్ లో 78.97, అస్సోంలో 74.05 , కేరళలో 73.06, డామన్ అండ్ డయ్యులో 73 శాతం, దాదర్ నగర్ హవేలీలో 71.43, గోవాలో 70.90, ఛత్తీస్ ఘడ్ లో 64.02 శాతం, కర్ణాటకలో 60.42, గుజరాత్ లో 59 శాతం, బీహార్ లో 60 శాతం, మహారాష్ట్రలో 62, ఉత్తరప్రదేశ్ లో 60.52, మహారాష్ట్రలో 62, ఉత్తరప్రదేశ్ లో 60.52, జమ్ముకశ్మీర్ లో 12.86 శాతం ఓటింగ్ జరిగిందని వివరించారు. ఒడిషా లో లోక్ సభకు, అసెంబ్లీకి జరిగిన ఏక కాల ఎన్నికలలో 64 శాతం పోలింగ్ నమోదైందని ఉమేష్ సిన్హా వివరించారు.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి