రాఫెల్ కేసులో తమ తీర్పుపై వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ధిక్కార నోటీస్ జారీ చేసింది.


రాఫేల్ కేసులో తమ తీర్పును ప్రధాని నరేంద్ర మోదీకి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయడంద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‘గాంధీకి సుప్రీం కోర్టు నిన్న నోటీసు జారీచేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలలో తమ తీర్పును తప్పుగా ఆపాదించారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై బీజేపీ ఎంపీ ‘మీనాక్షి లేఖి’ దాఖలు చేసిన నేరపూరిత కోర్టు ధిక్కార పిటిషన్‘పై ఈ నెల 30న విచారణ చేపడతామని ప్రకటించింది. రాఫేల్ యుద్ధ విమానాల కేసులో తీర్పును సవాలు చేస్తూ నిరుడు డిసెంబరులో దాఖలైన పిటిషన్‘ను కూడా దీనితో కలిపి విచారిస్తామని తెలిపింది. కాగా, లేఖి దాఖలు చేసిన పిటిషన్‘ను మూసివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ఈ సందర్భంగా ధర్మాసనం తోసిపుచ్చింది.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి