లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. 6వ విడ‌త ఎన్నిక‌ల కు నామినేష‌న్ల ప‌రిశీల‌న ఈరోజు జ‌రుగుతోంది.


నాల్గవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నిక పోలింగ్ జరగనుంది. ప్రదాన రాజకీయ పార్టీల అగ్రనాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చశారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్ లోని బీర్భం, నాడియా జిల్లాల్లోనూ, జాఖండ్ లోని లోహార్ దాగా లోనూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ లోని ముంగేర్, బేగుసరాయ్, సమస్తిపూర్లలోనూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ, ఉన్నావో, కాన్పూర్ లలోనూ, పార్టీ ప్రధాన కార్యదర్శి హమీర్ పూర్, ఫతేపూర్ లలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఈ దశలో మహారాష్ట్రలోని 17 నియోజకవ్గాల్లోనూ, త్తరప్రదేశ్, రాజస్థాన్ లలోని చెరి 13 నియోజకవర్గాల్లోనూ, పశ్చిమ బెంగాల్ లోని 8 నియోజకవర్గాల్లోనూ, ఒడిషా, మధ్య ప్రదేశ్ లలో చెరి 6 నియోజకవర్గాల్లోనూ బీహార్ లోని 5 నియోజకవర్గాల్లోనూ, జార్ఖండ్ లో మూడు స్థానాలో పోలింగ్ జరుగుతుంది ఇలా ఉండగా ఆరవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల వరిశీలన నేడు జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఈ దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏడవ దశల్లో పోలింగ్ జరుగుతోంది. మొదటి మూడు దశలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి