ఇరాన్ పై ఆంక్షల వల్ల ఛాబహర్ రేపు ప్రాజెక్టుపై ఎటువంటి ప్రభావం ఉండబోదని అమెరికా చెబుతుంది.


ఇరాన్‘పై తమ ఆంక్షల ప్రభావం చాబహర్ ఓడరేవు ప్రాజెక్టుపై పడబోదని అమెరికా ప్రకటించింది. ఇరాన్‘లోని ఈ రేవును భారత్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఈ మేరకు తెలిపారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతిపై భారత్ తో సహా తమ ఆంక్షల సడలింపు పొందిన 8 దేశాలకు వచ్చే నెలనుంచి ఆ మినహాయింపును పొడిగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి సహాయ పథకానికి సంబంధించి ఇరాన్ మీద ఆంక్షలను అమెరికా సడలించింది. చాబహర్ ఓడరేవు అభివృద్ధి-నిర్వహణ కూడా ఈ పథకంలో భాగంగా ఉండటంతో దీని విషయంలో సడలింపు కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి